సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో భారత బ్యాటింగ్ అత్యంత నిదానంగా సాగుతోంది. బౌలింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై భారత బ్యాటర్లు భారీ షాట్లు ఆడేందుకు తడబడుతున్నారు. పవర్ప్లేలో ఫీల్డింగ్ నిబంధనలు ఏమాత్రం ఉపయోగించుకోలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (11 నాటౌట్) టెస్టు తరహా బ్యాటింగ్ ఆడుతున్నాడు.
అదే సమయంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (3) కూడా నిరాశ పరిచాడు. పవర్ప్లే ముగిసిన వెంటనే నోర్జీ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో భారత జట్టు 17 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. పవర్ప్లేలో భారత జట్టు ఇంత తక్కువ స్కోరు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.