సఫారీలతో జరుగుతున్న తొలి వన్డే భారత జట్టు చేయి జారిపోయేలా ఉంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (12) విఫలమవడంతో జట్టుకు శుభారంభం లభించలేదు. అయితే ధావన్ (79), కోహ్లీ (51) జట్టును ఆదుకున్నారు. కానీ మిగతా బ్యాటర్లెవరూ ప్రభావం చూపడం లేదు.
శ్రేయాస్ అయ్యర్ (17), రిషభ్ పంత్ (16), వెంకటేశ్ అయ్యర్ (2), రవిచంద్రన్ అశ్విన్ (7) స్వల్పవిరామాల్లోనే వికెట్లు కోల్పోయారు. వీళ్లంతా ఒకరి తర్వాత ఒకరుగా పెవిలియన్కు క్యూ కట్టడంతో భారత జట్టు 200 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
భారత విజయానికి ఇంకా 97 పరుగులు కావలసి ఉండగా.. సఫారీలు మూడు వికెట్లు తీస్తే గెలుస్తారు. ప్రస్తుతం శార్దూల్ ఠాకూర్ భువనేశ్వర్ కుమార్ క్రీజులో ఉన్నారు.