సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది. బీభత్సమైన షాట్లతో సఫారీ బౌలర్లపై విరుచుకుపడిన సూర్యకుమార్ యాదవ్ (22 బంతుల్లో 61) రనౌట్ అయ్యాడు. నోర్జీ వేసిన 19వ ఓవర్ తొలి బంతిని పాయింట్ దిశగా కోహ్లీ కొట్టాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సఫారీ కెప్టెన్ బవుమా డైవ్ చేసి ఆ బంతిని అడ్డుకున్నాడు. అయితే అప్పటికే సూర్యకుమార్ పరుగు ప్రారంభించాడు. కోహ్లీ అతని వైపు చూసేసరికే సూర్య హాఫ్ క్రీజు దాటేసి, కోహ్లీకి రెండడుగుల దూరంలో నిలబడ్డాడు. బంతి అందుకున్న బవుమా.. దాన్ని నోర్జీకి అందించడంతో సూర్యకుమార్ రనౌట్ అయ్యాడు. భారత జట్టు 209 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.