భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో సఫారీలకు మంచి ఆరంభమే దక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫరీలకు ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే బుమ్రా షాకిచ్చాడు. ఓపెనర్ జానెమన్ మలాన్ (6)ను పెవిలియన్ చేర్చాడు.
బుమ్రా బౌలింగ్లో కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చిన మలాన్ అవుటయ్యాడు. అయితే ఆ వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డీకాక్ (14 నాటౌట్), కెప్టెన్ టెంబా బవుమా (12 నాటౌట్) ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో సఫారీలకు నెమ్మదైన ఆరంభం లభించింది.
వీళ్లిద్దరూ చాలా జాగ్రత్తగా ఆడటంతో పది ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు 39/1 స్కోరుతో నిలిచింది. ఈ పిచ్ ఉండేకొద్దీ నెమ్మదిస్తుందని తెలుస్తోంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో 250 స్కోరు చేసినా ఛేజింగ్ కష్టమే అంటున్నారు. మరి భారత బౌలర్లు సఫారీలను ఎంత స్కోరుకు కట్టడి చేస్తారో చూడాలి.