భారత్తో జరుగుతున్న నాలుగో టీ20లో సౌతాఫ్రికా మూడో వికెట్ కోల్పోయింది. ప్రమాదకరమైన క్లాసెన్ (8)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన 9 ఓవర్ తొలి బంతికి క్లాసెన్ బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే అతన్ని పెవిలియన్ చేర్చాడీ లెగ్స్పిన్నర్. చాహల్ వేసిన స్ట్రెయిట్ డెలివరీని ఆడటంతో క్లాసెన్ తడబడ్డాడు.
దాంతో బంతి అతని ప్యాడ్లను తాకింది. అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ క్లాసెన్ రివ్యూ కోరాడు. రిప్లేలో కూడా క్లాసెన్ అవుటనే రావడంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి సఫారీలు 58/3 స్కోరుతో నిలిచింది.