భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ వేసిన యాంగిల్ డెలివరీ.. సీనియర్ బ్యాటర్ క్వింటన్ డీకాక్ను బోల్తా కొట్టించింది. శార్దూల్ డెలివరీని థర్డ్మ్యాన్ వైపుగా ఆడేందుకు డీకాక్ ప్రయత్నించాడు. అయితే టైమింగ్ మిస్ అవడంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి.. వికెట్లను కూల్చింది. దీంతో సఫారీలు 104 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయారు. టీకి వెళ్లే సమయానికి సఫారీలు ఐదు వికెట్ల నష్టానికి 109 పరుగులు చేశారు. భారత్ చేసిన స్కోరు కంటే ఇంకా 218 పరుగులు వెనకబడి ఉన్నారు.
ఇప్పటి వరకూ భారత బౌలర్లు తీసిన వికెట్లన్నీ పేసర్ల ఖాతాలోనే పడ్డాయి. సఫారీ బౌలర్లలో కూడా పేసర్లే అన్ని వికెట్లూ కూల్చారు. కాగా, గాయం కారణంగా మైదానం వీడిన బుమ్రా తిరిగి రావడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. లంచ్ బ్రేక్ తర్వాత బౌలింగ్ చేసే సమయంలో ఫాలో త్రూలో బుమ్రా అదుపు తప్పాడు. కాలు మడతపడటంతో బాధతో విలవిల్లాడాడు. ఫిజియో నితిన్ పటేల్ వచ్చి అతన్ని డగౌట్కు తీసుకెళ్లి చికిత్స అందించాడు.