భారత పేసర్లు రెండో ఇన్నింగ్స్లో కూడా సత్తా చాటుతున్నారు. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి భారత జట్టు 174 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సఫారీలను మహమ్మద్ షమీ ఆదిలోనే దెబ్బ తీశాడు. ఓపెనర్ మార్క్రమ్ను ఒక్క పరుగుకే పెవిలియన్ చేర్చాడు. అయితే ఆ తర్వాత మరో వికెట్ పడకుండా కీగన్ పీటర్సన్ (17), కెప్టెన్ ఎల్గార్ జాగ్రత్తపడ్డారు.
కానీ వీళ్లిద్దరి టెక్నిక్, షాట్ల ఎంపికలో నిర్ణయాలను భారత బౌలర్లు పరీక్షిస్తూ వచ్చారు. చివరకు ఈ ఒత్తిడికి పీటర్సన్ తలొగ్గాడు. సిరాజ్ వేసిన లెంగ్త్ బాల్ను ఆడే ప్రయత్నం చేసిన అతను.. కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ ఎల్గార్తోపాటు వాన్ డర్ డస్సెన్ ఉన్నాడు.