IND Vs SA | దక్షిణాఫ్రికాతో కోల్కతాలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కు భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ అందుబాటులో ఉండడం లేదు. మ్యాచ్ రెండోరోజు టీమిండియా తొలి ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గిల్ గాయపడ్డ విషయం తెలిసిందే. గాయం కారణంగా పెవిలియన్కు చేరుకున్నాడు. ఆ తర్వాత గిల్ మైదానంలోకి దిగలేదు. శనివారం రాత్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. మూడోరోజు ఆట ప్రారంభానికి ముందు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కెప్టెన్ ఫిట్నెస్ గురించి అప్డేట్ ఇచ్చింది. కోల్కతా వేదికగా జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రెండోరోజు భారత ఇన్నింగ్స్ సమయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ మెడకు గాయమైందని తెలిపింది.
ఆట ముగిసిన తర్వాత పరీక్షల కోసం దవాఖానాకు తరలించామని.. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని బీసీసీ పేర్కొంది. తొలి టెస్ట్ మిగతా ఆటకు అందుబాటులో ఉండే అవకాశం లేదని.. బీసీసీఐ మెడికల్ టీమ్ అతని ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుందని బీసీసీఐ పేర్కొంది. కెప్టెన్ గైర్హాజరీలో టీమిండియా తొమ్మిది మంది బ్యాటర్స్తోనే రెండో ఇన్నింగ్స్ ఆడనున్నది. వాస్తవానికి తొలిరోజు మ్యాచ్కు ముందే గిల్ మెడ కండరాలు పట్టేయగా.. పెయిన్ కిల్లర్స్ సహాయంతో బ్యాటింగ్కు వచ్చాడు. మూడు బంతులు ఆడి ఓ ఫోర్ కొట్టాడు. ఈ సమయంలో మెడ కండరాలపై ఒత్తిడి పెరగడంతో నొప్పి తీవ్రవమైంది. ఫిజియో మైదానంలోకి వచ్చిన పరిస్థితిలో మార్పులు లేకపోవడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగాల్సి వచ్చింది.
🚨 Update 🚨
Captain Shubman Gill had a neck injury on Day 2 of the ongoing Test against South Africa in Kolkata. He was taken to the hospital for examination after the end of day’s play.
He is currently under observation in the hospital. He will take no further part in the… pic.twitter.com/o7ozaIECLq
— BCCI (@BCCI) November 16, 2025