సఫారీలతో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు ఐదో వికెట్ కోల్పోయింది. యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ భారీ షాట్కు ప్రయత్నించి పెవిలియన్ చేరాడు. కొంతకాలంగా షార్ట్ బాల్తో ఇబ్బందులు పడుతున్న అతను.. ఈసారి కూడా షార్ట్ బంతికే అవుయ్యాడు. పుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించినా కూడా సరిగా కంట్రోల్ లేకపోవడంతో అతను బౌండరీనికి క్లియర్ చేయలేకపోయాడు.
లాంగ్ లెగ్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న మగాల ఈ క్యాచ్ అందుకున్నాడు. దీంతో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అయ్యర్ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ క్రీజులో ఉన్నారు.