సఫారీ గడ్డపై భారత బౌలర్లు అదరగొడుతున్నారు. మూడో రోజు ఆటలో పేకమేడలా భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలడంతో వచ్చిన కష్టాన్ని తీర్చే బాధ్యతను బౌలింగ్ దళం తలకెత్తుకున్నట్లుంది.
తమ పదునైన బంతులతో సౌతాఫ్రికా బ్యాటర్లకు ముచ్చెమటలు పోయిస్తోంది. అయితే క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతున్న సఫారీ జట్టును మార్కో జాన్సెన్ (19), రబాడ (24 నాటౌట్) ఆదుకున్నారు.
వీళ్లిద్దరూ వికెట్ పడకుండా చాలా జాగ్రత్తగా ఆడారు. అయితే కీలక సమయాల్లో వికెట్లు తీయడంలో నిష్ణాతుడిగా పేరున్న శార్దూల్ ఠాకూర్.. మరోసారి తన పేరు నిలబెట్టుకున్నాడు. జాన్సెన్ను ఎల్బీగా వెనక్కు పంపాడు. దీంతో 8వ వికెట్కు 37 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం రబాడతో కేశవ్ మహరాజ్ క్రీజులో ఉన్నాడు.