కరోనా కారణంగా ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్కు దూరమైన పేసర్ మహమ్మద్ షమీ.. సౌతాఫ్రికాతో సిరీస్కు కూడా దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అతను కరోనా నుంచి కోలుకోలేదని కొందరు సన్నిహితులు చెప్తున్నారు. అయితే కరోనా నుంచి కోలుకున్నా పూర్తి ఫిట్నెస్ సాధించడానికి షమీకి ఎన్నిరోజులు పడుతుందో తెలియని పరిస్థితి.
టీ20 ప్రపంచకప్ ఆడే స్క్వాడ్లో రిజర్వ్ ప్లేయర్లలో ఒకడిగా ఉన్న షమీ.. ఫిట్గా లేకపోతే అతని స్థానంలో యువ పేస్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు ఇప్పటికే ఉమ్రాన్ను స్టాండ్బైలో ఉండాలని చెప్పారట. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.
అలాగే ఆస్ట్రేలియాతో మూడో మ్యాచ్లో వీపునొప్పితో జట్టుకు దూరమైన యువ ఆల్రౌండర్ దీపక్ హుడా కూడా సఫారీ సిరీస్కు దూరమైనట్లు తెలుస్తోంది. సౌతాఫ్రికాతో తొలి టీ20 ఆడేందుకు త్రివేండ్రం వచ్చిన జట్టులో హుడా లేడు. అతని స్థానంలో టీ20 రిజర్వ్ ఆటగాళ్లలో ఉన్న శ్రేయాస్ అయ్యర్ జట్టుతో కలవడం ఖాయమని తెలుస్తోంది. అయితే వీరిని సఫారీ సిరీస్కు ఎంపిక చేసినా వాళ్లు ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవచ్చు.