భారత్తో జరుగుతున్న వన్డే మ్యాచ్లో సౌతాఫ్రికా జట్టు మరో కీలక వికెట్ కోల్పోయింది. స్పెషలిస్టు బ్యాటర్లలో చివరి వాడైన హెన్నిక్ క్లాసెన్ (34) కూడా పెవిలియన్ చేరాడు. షాబాజ్ అహ్మద్ వేసిన 25వ ఓవర్లో అతను అవుటయ్యాడు. ఈ ఓవర్ తొలి బంతిని పాయింట్ దిశగా బౌండరీ బాదిన అతను.. ఆ తర్వాతి బంతిరి రెండు పరుగులు తీశాడు.
మూడో బంతిని కూడా పాయింట్ దిశగా కట్ చేసేందుకు రూం తీసుకున్నాడు. అయితే అతన్ని బీట్ చేసిన బంతి వికెట్లను కూల్చింది. దీంతో సఫారీ జట్టు 93 పరుగుల వద్ద తమ చివరి బ్యాటర్ వికెట్ కూడా కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో మార్కో జాన్సెన్, బ్యోర్న్ ఫోర్టూయిన్ ఉన్నారు.