సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు మొదటి వికెట్ కోల్పోయింది. 107 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా.. సఫారీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారీ షాట్లు ఆడలేకపోయింది. ఈ క్రమంలోనే రబాడ వేసిన మూడో ఓవర్లో రోహిత్ శర్మ (0) పెవిలియన్ చేరాడు.
ఆఫ్స్టంప్ ఆవల పడిన బంతిని డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నించిన రోహిత్.. దాని గమనాన్ని సరిగా అంచనా వేయలేకపోయాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ డీకాక్ అందుకోవడంతో భారత జట్టు 9 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.