సీనియర్లు నిలబడటంతో భారీ స్కోరు చేస్తుందనుకున్న భారత జట్టు మళ్లీ కష్టాల్లో పడింది. రహానే (58) అవుటైన కాసేపటికే పుజారా (53) కూడా పెవిలియన్ బాటపట్టాడు. చాలా రోజుల తర్వాత నిలకడగా ఆడుతున్న ఈ ద్వయం శతకాలు చేస్తుందని అభిమానులు భావించారు. కానీ ఇద్దరూ కూడా హాఫ్ సెంచరీలు సాధించి పెవిలియన్ చేరుకున్నారు.
రబాడా బౌలింగ్లో ఎల్బీగా అవుటయ్యాడు. పుజారా అవుటవడంతో క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ (0) మరోసారి విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో 17 పరుగులు చేసిన అతను ఈ ఇన్నింగ్సులో డకౌట్ అయ్యాడు. రబాడ బౌలింగ్లో ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు పంత్ ప్రయత్నించాడు.
రబాడ వేసింది షార్ట్ బంతి కావడంతో దాన్ని ఎక్స్ట్రాకవర్స్ పైనుంచి బాదడానికి ట్రైచేశాడు. కానీ షాట్ను సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు. దీంతో అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి కీపర్ వేరెన్నే వైపు వెళ్లింది. దాన్ని సునాయాసంగా అందుకున్న వేరెన్నె.. పంత్ను పెవిలియన్ పంపాడు. దీంతో భారతజట్టు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.