తొలి వన్డేలో సఫారీలు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. భారత బౌలర్లు ఆరంభంలో కొంత ప్రభావం చూపి పరుగులు కట్టడి చేశారు. కానీ ఆ తర్వాత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న సఫారీ బ్యాటర్లు భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. డీకాక్ (27), జానెమన్ మలన్6), ఎయిడెన్ మార్క్రమ్ (4) తక్కువ స్కోర్లకే అవుటయ్యారు.
ఆ తర్వాత టెంబా బవుమా (110), వాన్ డర్ డస్సెన్ (129 నాటౌట్) భారీ భాగస్వామ్యంతో సౌతాఫ్రికాను గట్టెక్కించారు. ముఖ్యంగా ఆర్వీడీ (వాన్ డర్ డస్సెన్) భారీ షాట్లతో విరుచకుపడ్డాడు. చివర్లో భారీ షాట్కు యత్నించిన బవుమా అవుటయ్యాడు. కానీ అప్పటికే సఫారీ జట్టు 272 పరుగులు చేసింది.
చివరి వరకూ ఆర్వీడీ క్రీజులో పాతుకుపోయ నిలబడటంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి సఫారీ జట్టు 296/4 స్కోరు చేసింది. ఈ పిచ్పై 250 పరుగులు కూడా మంచి స్కోరే అని విశ్లేషకులు అంటున్న నేపథ్యంతో భారత బ్యాటర్లు ఎలాంటి ప్రతిఘటన చూపుతారో చూడాలి.
భారత బౌలర్లలో రెండు వికెట్లు తీసిన బుమ్రా చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఒక వికెట్ తీసుకున్న అశ్విన్, మరో స్పిన్నర్ చాహల్ ఫర్వాలేదనిపించే స్పెల్స్ వేశారు. అయితే భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు.