సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎన్గిడీ మరోసారి భారత్ను దెబ్బకొట్టాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (35)ని పెవిలియన్ పంపాడు. నిలకడగా ఆడుతున్న కోహ్లీ దూరంగా వెళ్తున్న బంతిని డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు. అనవసరైన షాట్కు యత్నించి వికెట్ చేజార్చుకున్నాడు. దీంతో టీమిండియా 199 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
అంతకు ముందు భారత్ కోల్పోయిన రెండు వికెట్లు కూడా ఎన్గిడీనే తీశాడు. అర్ధశతకం చేసి జోరుమీదున్న ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (60)ను అవుట్ చేసిన అతను.. ఆ తర్వాతి బంతికే ఛటేశ్వర్ పుజారా (0)ను గోల్డెన్ డక్గా వెనక్కు పంపాడు.