సఫారీ టూర్లో వన్డే సిరీస్లో వైట్ వాష్కు గురైన భారత జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై పలువురు పెదవి విరిచారు. ఈ క్రమంలో సిరీస్ గురించి మాట్లాడిన రాహుల్.. జట్టుకు నాయకత్వం వహించడం తనకు దక్కిన అరుదైన గౌరవమని, తాను గర్వించదగ్గ అంశమని చెప్పాడు.
సఫారీ సిరీస్ ఓటమి గురించి కూడా ప్రస్తావించిన అతను.. ‘‘కష్టమైన ప్రయాణాలు మనం ఎదగడానికి ఉపయోగపడతాయి. వీటి వల్ల మనం బలంగా తయారవుతాం. ఫలితం మాకు అనుకూలంగా రాకపోవచ్చు. కానీ మేం చేసిన తప్పుల నుంచి కచ్చితంగా నేర్చుకుంటాం’’ అని వివరించాడు.
ఈ సిరీస్లో బ్యాటుతో కూడా రాహుల్ అద్భుతాలు సాధించలేదు. తొలి వన్డేలో నిరాశపరిచిన అతను.. రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించాడు. మళ్లీ మూడో వన్డేలో విఫలమయ్యాడు. ఈ మూడు మ్యాచుల్లోనూ భారత్ ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో మాత్రం కొంత పోటీ ఇవ్వగలిగింది.