టీమిండియాకు షాక్. సఫారీలతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ను గెలిపిస్తాడనుకున్న మాజీ సారధి విరాట్ కోహ్లీ (65)ని స్పిన్నర్ కేశవ్ మహరాజ్ పెవిలియన్ చేర్చాడు. అనూహ్యంగా బౌన్స్ అయిన బంతి కోహ్లీని ఆశ్చర్య పరిచింది.
దాన్ని ఆడే ప్రయత్నంలో అతను బ్యాటను మరింత పైకి లేపాడు. దీంతో టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. ఈ కీలక క్యాచ్ను సఫారీ కెప్టెన్ టెంబా బవుమా వెనక్కు తిరిగి పరిగెడుతూ అందుకున్నాడు. దీంతో సెంచరీ చేస్తాడని ఎదురు చూసిన కోహ్లీ అభిమానులు నిరాశలో పడిపోయారు.
కానీ కీలక సమయంలో జట్టును కోహ్లీ ఆదుకున్నాడనడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్తోపాటు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. వీళ్లిద్దరి భాగస్వామ్యం మీదనే భారత జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.