సఫారీలతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ రికార్డు సృష్టించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఒక ఎండ్లో వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఎండ్లో తడబడకుండా నిలిచిన రాహుల్.. 128 బంతుల్లో అర్ధశతకం సాధించాడు.
భారత్కు అచ్చొచ్చిన ఈ మైదానంలో భారీ అంచనాలతో బరిలో దిగిన టీమిండియా బ్యాటింగ్ లైనప్ తలకిందులైంది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (26) మరోసారి తనకు దక్కిన శుభారంభాన్ని భారీ స్కోరుగా మలచలేక అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన ఛటేశ్వర్ పుజారా.. 33 బంతులాడి 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
ఆ మరుసటి బంతికే రహానే (0) గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. ఇలాంటి సమయంలో హనుమ విహారి (20)తో జతకలిసిన రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డాడు. అయితే రబాడ బౌలింగ్లో ఎక్స్ట్రా బౌన్స్కు విహారి బోల్తా కొట్టాడు.
ఆ తర్వాత పంత్ (12 నాటౌట్) క్రిజులోకి వచ్చాడు. వీళ్లిద్దరూ కలిసి భారత స్కోరును 100 పరగులు దాటించారు. ఈ క్రమంలోనే రాహుల్ అర్ధశతకం కూడా పూర్తిచేశాడు.