సఫారీలతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్కు తొలి దెబ్బ తగిలింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ను ఎన్గిడీ ఐదో ఓవర్లోనే దెబ్బ కొట్టాడు. ఈ ఓవర్ తొలి బంతికే భారత కెప్టెన్ కేఎల్ రాహుల్ (9) అవుటయ్యాడు.
అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని ఫస్ట్ స్లిప్లో ఉన్న మలన్ చక్కగా అందుకున్నాడు. దీంతో రాహుల్ ఇన్నింగ్స్ స్వల్పస్కోరుకే ముగిసింది. భారత జట్టు 18 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది.
అంతకుముందు భారత బౌలర్లను సఫారీ ఓపెనర్లు సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ ఆ తర్వాత భారత బౌలర్లు పుంజుకోవడంతో 287 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.