సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత్కు శుభారంభం దక్కలేదు. యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ (1) మరోసారి నిరాశ పరిచాడు. రబాడ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే అతను పెవిలియన్ చేరాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న గైక్వాడ్.. ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.
ఆఫ్ స్టంప్ ఆవల పడిన బంతిని కవర్స్ వైపు మళ్లించేందుకు రుతురాజ్ ప్రయత్నించాడు. అయితే టైమింగ్ మిస్ బంతి.. బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కేశవ్ మహరాజ్ వైపు నేరుగా వెళ్లింది. అతను చక్కని క్యాచ్ అందుకోవడంతో రుతురాజ్ మైదానం వీడాడు.