తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకంతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్.. రెండో ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు సమిష్టిగా రాణించి సఫారీలను 197 పరుగలకే ఆలౌట్ చేశారు. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో మార్కో జాన్సెన్ వేసిన బంతికి మయాంక్ వెనుతిరిగాడు. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని డీకాక్ చక్కగా క్యాచ్ పట్టేశాడు. దీంతో మయాంక్ పెవిలియన్ బాటపట్టాడు. 12 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో మయాంక్ 60 పరుగలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
మయాంక్ అవుటవడంతో నైట్ వాచ్మెన్గా శార్దూల్ ఠాకూర్ బరిలో దిగాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ (5 నాటౌట్), శార్దూల్ (4 నాటౌట్) క్రీజులో ఉన్నారు.