సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడే భారత జట్టులో అనూహ్యంగా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. ధావన్కు సౌతాఫ్రికాలో అవకాశం వస్తుందని ఎవరూ ఊహించలేదు. అదీగాక, ఇటీవల జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో ధవన్ అత్యంత పేలవ ప్రదర్శన కనబరిచాడు.
ఇలాంటి పరిస్థితుల్లో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు ప్రకటించిన 18 మంది సభ్యుల బృందంలో ధావన్ పేరు ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అయితే ధావన్కు ఈ అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయమే అని భారత మాజీ క్రికెటర్లు సాబా కరీమ్, రితేందర్ సోధి అభిప్రాయపడ్డారు.
సౌతాఫ్రికాలో వన్డే టూర్కు యువఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ కూడా ఎంపికయ్యాడు. ఈ మహారాష్ట్ర ఓపెనర్.. విజయ్ హజారే ట్రోఫీ టాప్ స్కోరర్గా నిలిచాడు. కానీ ధావన్ కారణంగా రుతురాజ్కు ఆడే 11 మందిలో చోటు దక్కకపోవచ్చు కదా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై స్పందించిన సాబా కరీమ్.. కేవలం దేశవాళీల్లో ప్రదర్శన ఆధారంగా ధావన్ ఎంపికను తప్పుపట్టకూడదన్నాడు. భారత జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ధావన్ ఎంతో చేశాడని, ఆ ప్రదర్శనల ఆధారంగానే అతన్ని సౌతాఫ్రికా టూర్కు ఎంపిక చేశారని స్పష్టం చేశాడు.
ఒక అనుభవజ్ఞుడైన బ్యాటర్ అవసరం అనుకున్నందుకే సెలెక్టర్లు ధావన్ను ఎంపిక చేశారని సోధి కూడా చెప్పాడు. ధావన్లో మరికొన్నేళ్లు భారత్ తరఫున క్రికెట్ ఆడే సత్తా ఉందని ఈ మాజీలిద్దరూ అభిప్రాయపడ్డారు.