విశాఖపట్టణం వేదికగా జరుగుతున్న మూడో టీ20లో సీనియర్ స్పిన్నర్ చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. పొదుపుగా బంతులు వేయడమే కాకుండా 15వ ఓవర్లో ప్రమాదకరమైన క్లాసెన్ (29)ను పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన బంతిని భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన క్లాసెన్.. సరిగా అంచనా వేయలేకపోయాడు.
దాంతో బ్యాట్ అంచున తగిలిన బంతి గాల్లోకి లేచింది. దాన్ని ఎక్స్ట్రా కవర్లో ఉన్న అక్షర్ పటేల్ సులభంగా అందుకున్నాడు. దాంతో క్లాసెన్ ఇన్నింగ్స్ ముగిసింది. 15 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 102 పరుగులతో నిలిచింది.