సఫారీలతో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు సత్తా చాటుతున్నారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు మిడిలార్డర్ వైఫల్యం కారణంగా అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. అయితే లక్ష్య ఛేదనలో బౌలర్లు మాత్రం సౌతాఫ్రికాను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అక్షర్ పటేల్ తన తొలి ఓవర్లోనే భారత్కు బ్రేక్ ఇవ్వగా.. ఆ తర్వాత చాహల్ కూడా సత్తా చాటాడు. హర్షల్ కూడా ఒక వికెట్ తీశాడు.
ఇన్నింగ్స్ 9వ ఓవర్లో బంతి అందుకున్న చాహల్.. ప్రమాదకర ప్రిటోరియస్ను బుట్టలో వేశాడు. చాహల్ వేసిన బంతిని ఆడటంలో అంచనా తప్పిన ప్రిటోరియస్.. కీపర్ పంత్కు క్యాచ్ ఇచ్చాడు. అతను దాన్ని అందుకోవడంతో నిరాశగా మైదానం వీడాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి సౌతాఫ్రికా జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 63 పరుగులతో నిలిచింది.