ఆసియా కప్లో భాగంగా పాకిస్తాన్తో జరుగుతున్న టీ20 మ్యాచ్లో భారత జట్టు మరో వికెట్ కోల్పోయింది. హాంగ్కాంగ్పై చెలరేగి ఆడిన సూర్యకుమార్ యాదవ్ (13) నిరాశ పరిచాడు. 10వ ఓవర్లో మహమ్మద్ నవాజ్ వేసిన బంతిని స్వీప్ చేసి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
అయితే సరైన టైమింగ్ కుదరకపోవడంతో స్క్వేర్ లెగ్లో ఉన్న ఆసిఫ్ అలీకి సులభమైన క్యాచ్ ఇచ్చాడు. అతను ఎలాంటి పొరపాటు లేకుండా క్యాచ్ అందుకోవడంతో సూర్యకుమార్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత జట్టు పది ఓవర్లు ముగిసే సరికి 93/3 స్కోరుతో నిలిచింది.