ఆసియా కప్ వేదికగా దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. గతేడాది ఇదే దుబాయ్లో ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. క్రీడాభిమానులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు అంతా సిద్ధమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత సారధి రోహిత్ శర్మ ముందుగా బౌలింగ్ చేస్తామని చెప్పాడు.
శనివారం నాడు అఫ్ఘాన్, శ్రీలంక జట్ల మధ్య కూడా ఈ పిచ్ తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్కు పూర్తిగా సహకరించిన సంగతి తెలిసిందే. తమ ముందు లక్ష్యం ఉంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతోనే బౌలింగ్ ఎంచుకున్నామని రోహిత్ చెప్పాడు. అలాగే ఈ మ్యాచ్లో పంత్ ఆడటం లేదని, దినేష్ కార్తీక్ వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వర్తిస్తాడని చెప్పాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, భువనేశ్వర్ కుమార్, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్
పాకిస్తాన్ జట్టు: బాబర్ ఆజమ్ (కెప్టెన్), మహమ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్దిల్ షా, ఆసిఫ్ అలీ, మహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, నసీమ్ షా, హారిస్ రవూఫ్, షహ్నవాజ్ దహానీ
Captain @ImRo45 has won the toss and we will bowl first against Pakistan.
A look at our Playing XI for the game.
Live – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/O0HQXFQzC4
— BCCI (@BCCI) August 28, 2022