పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు తొలి వికెట్ తీసుకుంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ తన రెండో ఓవర్లోనే సత్తాచాటాడు. తొలి ఓవర్లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను ఇబ్బంది పెట్టిన భువీ.. మూడో ఓవర్ నాలుగో బంతికి అతన్ని అవుట్ చేశాడు. భువీ వేసిన షార్ట్ బాల్ను పుల్ చేసేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో ఎడ్జ్ తీసుకున్న బంతి గాల్లోకి లేచింది. షార్ట్ ఫైన్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న అర్షదీప్ ఈ క్యాచ్ అందుకోవడంతో బాబర్ నిరాశగా పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ జట్టు మూడు ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది.