దుబాయ్: టీ20 ప్రపంచకప్ టోర్నీలోనే అత్యంత హైఓల్టేజ్ మ్యాచ్కు దుబాయ్ వేదిక రెడీ అయింది. సూపర్ 12 దశలో భారత్, పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఇప్పటి వరకూ ఐసీసీ టోర్నీల్లో పాక్పై భారత్ ఆధిపత్యం చెలాయిస్తూనే ఉంది.
టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో ఈ రెండు జట్లు 5 సార్లు తలపడగా ఐదుసార్లూ భారతే విజయం సాధించింది. ఈసారి కూడా భారత జట్టే ఫేవరెట్గా బరిలో దిగుతోంది. ఈ క్రమంలో భారత జట్టు సారధి విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ స్పందించాడు. భారత్ వద్ద అనుభవం, సామర్ధ్యం ఉన్న జట్టు ఉందని, వారు ఒత్తిడిని ఎదుర్కోగలరని రాజ్కుమార్ అన్నాడు.
‘పాకిస్థాన్తో తలపడటం వంటి ఛాలెంజ్లు అంటే విరాట్ కోహ్లీకి ఎప్పుడూ ఇష్టమే. పాక్పై పరుగులు చేయడాన్ని అతడు బాగా ఎంజాయ్ చేస్తాడు. టీ20 ప్రపంచకప్పుల్లో ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా పాకిస్థాన్ జట్టు అతన్ని అవుట్ చేయలేదు. ఇదో రికార్డు’ అని రాజ్కుమార్ పేర్కొన్నాడు.