టీ20 ప్రపంచకప్ సూపర్-12లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ వేసిన 12వ ఓవర్లో మూడు భారీ సిక్సర్ల సాయంతో 21 పరుగులు పిండుకున్న ఇఫ్తికర్ అహ్మద్ (51) పెవిలియన్ చేరాడు. అక్షర్ వేసిన ఓవర్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను.. షమీ వేసిన 13వ ఓవర్ రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు.
ఆ ఓవర్ తొలి బంతికి కూడా ఎల్బీ కోసం ప్రయత్నించిన షమీ.. బంతి బ్యాటును తాకడంతో విఫలమయ్యాడు. రెండో బంతి అహ్మద్ బ్యాటును తప్పించుకొని నేరుగా బ్యాక్ ఫుట్పై తగిలింది. దీంతో అంపైర్ మరో ఆలోచన లేకుండా అవుట్ ఇచ్చాడు. ఈ నిర్ణయంపై ఇఫ్తికర్ అహ్మద్ రివ్యూకు వెళ్లలేదు. దీంతో ఆ జట్టు 13 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులతో నిలిచింది.