భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. బంతికి హాఫ్ సెంచరీతో చెలరేగిన ఇఫ్తికర్ అహ్మద్ (51).. షమీ వేసిన 13వ ఓవర్ రెండో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఆ మరుసటి ఓవర్లోనే హార్దిక్ పాండ్యా బౌలింగ్లో షాదాబ్ ఖాన్ (5) పెవిలియన్ చేరాడు.
ఆఫ్స్టంప్ వైపు యాంగిల్ చేసిన బంతిని స్లాగ్ చేసేందుకు షాదాబ్ ప్రయత్నించాడు. అయితే హార్దిక్ వేసిన లెంగ్త్ ఆ షాట్కు సహకరించలేదు. దీంతో గాల్లోకి లేచిన బంతి.. లాంగాన్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్కు చిక్కింది. దీంతో షాదాబ్ నిరాశగా పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ చివరి బంతికి మరో వికెట్ తీసిన పాండ్యా.. హైదర్ అలీ (2)ని కూడా పెవిలియన్ చేర్చాడు.
పాండ్యా వేసిన లెంగ్త్ను ఆడటం కష్టం అవడంతో హైదర్ అలీ కూడా షాదాబ్ చేసిన తప్పునే చేశాడు. ఆ బంతిని బలంగా బాదేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో డీప్ మిడ్వికెట్లో సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి తను కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ఆ జట్టు 14 ఓవర్లు ముగిసే సరికి 98 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది.