భారత్తో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్తాన్కు తొలి దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ (0) తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. అర్షదీప్ సింగ్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతిని లెగ్సైడ్ ఆడేందుకు అతను ప్రయత్నించాడు. అయితే అతని బ్యాటును తప్పించుకున్న బంతి ప్యాడ్లపై తాకింది.
ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేయగా అంపైర్ అవుటిచ్చాడు. అయితే బాబర్ రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి వికెట్లను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపించడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు. అంతకుముందు తొలి ఓవర్లో భువనేశ్వర్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో పాక్ జట్టు ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయినట్లయింది.