IND vs NZ | న్యూజిల్యాండ్తో జరిగే రెండో టీ20 మ్యాచ్ కోసం భారత జట్టులో ఒక మార్పు చేస్తే చాలా బాగుంటుందని వెటరన్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రాబిన్ ఊతప్ప అన్నాడు. తొలి టీ20లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ను నాలుగు లేదా ఐదో స్థానంలో దించాలని ఊతప్ప అభిప్రాయపడ్డాడు.
శ్రేయాస్ అయ్యర్ను మూడో స్థానంలో పంపితే బాగుంటుందని చెప్పాడు. క్రీజులో కుదురుకునేందుకు శ్రేయాస్ సమయం తీసుకుంటాడని, సూర్య అలా కాదని అన్నాడు. ‘బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కడైనా ఆడగలిగే సత్తా సూర్యకు ఉంది. ఐదు, ఆరు స్థానాల్లో వచ్చి అతను అద్భుతంగా ఆడటం నేను చూశా’ అని ఊతప్ప వివరించాడు.
అదే సమయంలో సూర్య వంటి ఆటగాడు బ్యాటింగ్ ఆర్డర్లో కింద రావడం వల్ల రిషభ్ పంత్కు అండగా నిలబడే అవకాశం ఉంటుందని చెప్పాడు.
‘క్రీజులో కుదురుకోవడానికి శ్రేయాస్కు సమయం పడుతుంది. కానీ సూర్య అలా కాదు. క్రీజులోకి వచ్చీరాగానే విరుచుకుపడగలడు. ఏ స్థానంలో దిగినా అతను ప్రమాదకరమైన వాడే. అలాంటి వాడిని ఐదు లేదా ఆరో స్థానంలో దింపితే.. రిషభ్ పంత్కు సపోర్ట్ దొరుకుతుంది. మ్యాచ్ ఫినిషర్గా పంత్ ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది’ అని ఊతప్ప విశ్లేషించాడు.
వచ్చే టీ20 ప్రపంచకప్ నాటికి పంత్ మంచి ఫినషర్గా మారాల్సిన అవసరం ఉందని, సూర్య వంటి ఆటగాడి సపోర్ట్ దొరికితే పంత్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పాడు. ప్రపంచకప్కు వెళ్లే సమయానికి ఇలాంటి చిన్న నిర్ణయాలే పంత్ను అద్భుతమైన ఫినిషర్గా మారుస్తాయని అభిప్రాయపడ్డాడు.