భారత్లో న్యూజిల్యాండ్ జట్టు పర్యటనలో భాగంగా జరిగే టెస్టులకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కోహ్లీ స్థానంలో తొలి టెస్టుకు రహానే నాయకత్వం వహించనున్నాడు. వచ్చే నెలలో కీలకమైన సౌతాఫ్రికా టూర్ ఉన్న నేపథ్యంలో బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో అతను విశ్రాంతి తీసుకుంటాడని బీసీసీఐ తెలిపింది. అయితే ఈ టెస్టు సిరీస్కు స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు.
కండరాల నొప్పి కారణంగా రాహుల్ ఈ టెస్టు సిరీస్కు దూరమవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను జట్టులోకి తీసుకున్నారు. తొలి టెస్టు ఈ నెల 25న కాన్పూర్లో మొదలవుతుంది. రెండో టెస్టు డిసెంబరు 3 నుంచి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. రెండో టెస్టు నాటికి కోహ్లీ జట్టుతో చేరతాడు.
భారత జట్టు: అజింక్య రహానే (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా, శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ
న్యూజిల్యాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, హెన్నీ నికోలస్, అజాజ్ పటేల్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ శాంట్నర్, విల్ సోమర్విల్లె, టిమ్ సౌథీ, రాస్ టేలర్, విల్ యంగ్, నీల్ వాగ్నర్.