జైపూర్: హాఫ్ సెంచరీతో అదరగొట్టిన సూర్యకుమార్ యాదవ్ (62) ఇన్నింగ్స్ ముగిసింది. ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్లో అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అతను కెప్టెన్ రోహిత్ శర్మ (48)తో కలిసి 59 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
రోహిత్ అవుటైన కాసేపటికే అర్ధశతకం పూర్తి చేసుకొన్న అతను గేరు మార్చాడు. బౌండరీలతో స్కోరు బోర్డు వేగం పెంచాడు. ఈ క్రమంలోనే బౌల్ట్ బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు. 144 పరుగల వద్ద భారత జట్టు మూడో వికెట్ కోల్పోయింది.