IND vs NZ : పది ఓవర్లకు భారత్ 74 రన్స్ చేసింది. 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో.. వైస్ కెప్టెన్ సూర్య (39), కెప్టెన్ పాండ్యా (24) ఇన్నింగ్స్ నిర్మించే భాద్యత తీసుకున్నారు. సింగిల్స్ తీస్తూ, వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడతూ జట్టు స్కోర్ 50 దాటించారు. వీళ్లు నాలుగో వికెట్కు 59 రన్స్ చేశారు. మొదట్లో భారీ షాట్లు ఆడకుండా నిదానంగా ఆడిన వీళ్లు ఆ తర్వాత దూకుడు పెంచారు. సోధీ 9వ ఓవర్, టిక్నర్ వేసిన పదో ఓవర్లో సూర్య వరుసగా రెండు బౌండరీలు బాదాడు.