IND vs NZ : శార్ధూల్ ఠాకూర్ భారత్కు బ్రేక్ ఇచ్చాడు. కివీస్ కెప్టెన్ లాథమ్ను డకౌట్ చేశాడు. అతను వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి న్యూజిలాండ్ను ఒత్తిడిలోకి నెట్టాడు. 25వ ఓవర్ తొలి రెండు బంతులకు మిచెల్(24), లాథమ్ను శార్థూల్ ఔట్ చేశాడు. డారిల్ మిచెల్ ఇచ్చిన క్యాచ్ను కీపర్ ఇషాన్ కిషన్ అందుకున్నాడు. అయితే.. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఇండియా రివ్యూ తీసుకుంది. రివ్యూలో బంతి మిచెల్ వేలికి తగలడంతో అంపైర్ ఔట్ ఇచ్చాడు. దాంతో, కివీస్ 184 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. దాంతో మిచెల్, కాన్వే 78 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. కాన్వే 116, గ్లెన్ ఫిలిప్స్ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు. కివీస్ 25 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 193 రన్స్ చేసింది.