హామిల్టన్: మహిళల ప్రపంచకప్లో (Women’s world cup )లో భాగంగా టీమిండియా తన రెండో మ్యాచ్లో ఆతిథ్య న్యూజిల్యాండ్ జట్టుతో తలపడుతున్నది. టాస్గెలిచిన టీమిండియా కెప్టెన్ మిథాలీరాజ్ ఆతిత్య జట్టును బ్యాంటింగ్కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఆరంభంలోనే తొలి వికెట్ కోల్పోయింది. కివీస్ బ్యాటర్ సుజీ బేట్స్ జట్టు స్కోరు 9 పరుగుల వద్ద మొదటి వికెట్గా వెనుతిరిగింది. అయితే తర్వాత బ్యాంటింగ్కు వచ్చిన అమెలియా కెర్ బ్యాట్ ఝులిపించడంతో స్కోరు బోర్డు పరుగులుపెట్టింది. ప్రస్తుతం రెండు కోల్పోయిన కివీస్ 20 ఓవర్లకు 118 పరుగులు చేసింది.