ముంబై వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిల్యాండ్ రెండో టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు 276 పరుగుల వద్ద డిక్లేర్ చేసి కివీస్ ముందు 540 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. అనంతరం రవిచంద్రన్ అశ్విన్ చెలరేగడంతో న్యూజిల్యాండ్ బ్యాటర్లు విలవిల్లాడారు.
ఓపెనర్లిద్దరితోపాటు వెటరన్ రాస్ టేలర్ వికెట్ కూడా అశ్విన్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత క్రీజులో నిలదొక్కుకున్న డారియల్ మిచెల్ (60)ను అక్షర్ పటేల్ అవుట్ చేశాడు. ఆ వెంటనే వికెట్ కీపింగ్ బ్యాటర్ టామ్ బ్లండెల్ను సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా ఉన్న కేఎస్ భరత్ అవుట్ చేశాడు.
హెన్రీ నికోల్స్ కొట్టిన బంతి నేరుగా భరత్ వద్దకు వెళ్లింది. అప్పటికే ఇద్దరు బ్యాటర్లు రన్ కోసం వెళ్లిపోయారు. ఈ సమయంలో తొందరపాటు లేకుండా వికెట్ కీపర్కు బంతిని అందించాడు భరత్. దీంతో టామ్ బ్లండెల్ (0) సులభంగా రనౌట్ అయ్యాడు.