కాన్పూర్ టెస్టులో టీమిండియా బౌలర్లు సత్తాచాటారు. రెండో రోజు ఆటలో పూర్తిగా తేలిపోయిన బౌలర్లు.. మూడోరోజు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రెండో రోజు భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన కివీస్ ఓపెనర్లు యంగ్ (89), టామ్ లాథమ్ (95) తర్వాత మరే బ్యాట్స్మెన్ కూడా నిలబడలేకపోయాడు.
కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (18), రాస్ టేలర్ (11), హెన్రీ నికోల్స్ (2), టామ్ బ్లండెల్ (13), రచిన్ రవీంద్ర (13), కైల్ జేమీసన్ (23), టిమ్ సౌథీ (5), విల్ సోమర్విల్లె (6), అజాజ్ పటేల్ (5 నాటౌట్) పరుగులు చేశారు. బారత బౌలర్లలో అక్షర్ పటేల్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు.
అశ్విన్ మూడు వికెట్లు కూల్చగా జడేజా, ఉమేష్ యాదవ్ చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో మొత్తం 142.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన న్యూజిల్యాండ్ జట్టు 296 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 345 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అంటే భారత్ కన్నా కివీస్ 49 పరుగులు వెనుకబడే ఉందన్నమాట.