IND vs NZ | టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో న్యూజిల్యాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. కివీస్ పేసర్ టిమ్ సౌథీ ఐదు వికెట్లతో చెలరేగడంతో భారత జట్టు 345 పరుగులకు ఆలౌట్ అయింది. అరంగేట్ర ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ (105) సెంచరీతో అదరగొట్టాడు.
భారత జట్టు ఆలౌట్ అవడంతో బరిలోకి దిగిన న్యూజిల్యాండ్ చాలా నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు టామ్ లాథమ్ (34 నాటౌట్), విల్ యంగ్ (63 నాటౌట్) ఆ జట్టుకు శుభారంభం అందించారు. ముఖ్యంగా యంగ్.. అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
వీరి జోడీని విడగొట్టేందుకు టీమిండియా కెప్టెన్ రహానే చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వీరిద్దరూ చాలా సహనంగా ఆడుతుండటంతో కివీస్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 39 ఓవర్లలో 101 పరుగులు చేసింది.