జైపూర్: తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన కివీస్.. మళ్లీ పుంజుకుంది. భారత పర్యటనలో భాగంగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో పేసర్ భువనేశ్వర్ కుమార్.. ఆ జట్టును ఆరంభంలోనే దెబ్బ తీశాడు. తొలి ఓవర్ మూడో బంతికే ఫామ్లో ఉన్న డారియల్ మిచెల్ (0)ను గోల్డెన్ డక్గా వెనక్కు పంపాడు.
అయితే అక్కడి నుంచి న్యూజిల్యాండ్ జట్టు నెమ్మదిగా పుంజుకుంది. వెటరన్ మార్టిన్ గప్తిల్ (9 నాటౌట్) అండగా మార్క్ చాప్మ్యాన్ (30 నాటౌట్) నిలబడ్డాడు. వీరిద్దరూ మిచెల్ వికెట్ కోల్పోయిన ఒత్తిడి లేకుండా ఆడారు. దీంతో పవర్ప్లే ముగిసే సరికి కివీస్ జట్టు 6 ఓవర్లలో 41/1 స్కోరు సాధించింది.