కివీస్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో టీమిండియా సారధి రోహిత్ శర్మ (56) అదరగొట్టాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఇషాన్ కిషన్ (29), రోహిత్ శర్మ శుభారంభం అందించారు. అయితే కివీస్ తాత్కాలిక కెప్టెన్ శాంట్నర్ భారత్ను దెబ్బకొట్టాడు.
తన తొలి ఓవర్లోనే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (0)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ (4) కూడా శాంట్నర్ మాయలో పడి వికెట్ చేజార్చుకున్నాడు. ఇలా ఒకపక్క వికెట్లు టపటపా రాలుతున్నా రోహిత్ సంయమనం పాటించాడు.
జట్టు బాధ్యతను భుజాలపై వేసుకొని ఆడాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే ఆ వెంటనే ఇష్ సోధి వేసిన 12వ ఓవర్లో స్ట్రెయిట్ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో సోధి అందుకున్న అద్భుతమైన క్యాచ్కు వెనుతిరిగాడు.