IND vs NZ : జాకబ్ డఫె కివీస్కు ఐదో వికెట్ అందించాడు. అతని ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ (14) లాంగాఫ్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ స్వల్ప వ్యవధిలోనే కీలకమైన మూడు (కోహ్లీ, ఇషాన్, సూర్య) వికెట్లు కోల్పోయింది. అంతకుముందు కోహ్లీ (36) డఫే బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. న్యూజిలాండ్ బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ భారత్ను ఒత్తిడిలోకి నెడుతున్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా 10, వాషింగ్టన్ సుందర్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 40 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్.. 309/5