IND vs NZ : టీమిండియా కష్టాల్లో పడింది. వెంట వెంటనే సూర్యకుమార్ (47), పాండ్యా(21) పెవిలియన్ చేరారు. బ్రేస్వెల్ ఓవర్లో పాండ్యా అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అంతకుముందు ఓవర్లో ఇష్ సోధీ కివీస్కు బ్రేక్ ఇచ్చాడు. ప్రమాదకరమైన సూర్యకుమార్ యాదవ్(47)ను ఔట్ చేశాడు. దాంతో, పాండ్యా, సూర్య 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. సోధీ ఓవర్లో మూడో బంతికి సిక్సర్ బాదిన సూర్య నాలుగో బంతికి క్యాచ్ అవుట్ అయ్యాడు. ఫిన్ అలెన్ క్యాచ్ను ఒడిసి పట్టుకున్నాడు. దాంతో, భారత్ 83 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ క్రీజులో ఉన్నారు. 13 ఓవర్లకు భారత్ స్కోర్.. 90/5 మ్యాచ్ గెలవాలంటే 42 బంతుల్లో 87 రన్స్ చేయాలి.