మూడో రోజు ఆటలో ఆధిపత్యం చెలాయించిన భారత్.. మూడోరోజు మాత్రం పైచేయి సాధించలేకపోయింది. 14/1 ఓవర్నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ తడబడింది. బ్యాట్స్మెన్ ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేదు. మూడోరోజు చివర్లో శుభ్మన్ గిల్ (1) దారుణంగా అవుటైన విషయం తెలిసిందే.
నాలుగో రోజు ఉదయం పుజారా (22), అజింక్య రహానే (4) మయాంక్ అగర్వాల్ (17) మరోసారి నిరాశపరిచారు. ఆ తర్వాత జడేజా (0) డకౌట్ అవడంతో భారత్ పూర్తిగా కష్టాల్లో కూరుకుపోయింది. అయితే శ్రేయాస్ అయ్యర్ (65), అశ్విన్ (32) జట్టును ఆదుకున్నారు. కాసేపటికి అశ్విన్ వెనుతిరిగినా వృద్ధిమాన్ సాహా (34 నాటౌట్)తో కలిసి అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.
అయ్యర్ వెనుతిరిగిన తర్వాత అక్షర్ పటేల్ (9 నాటౌట్) క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 167 ఓవర్లలో భారత జట్టు 7 వికెట్లు నష్టపోయి 191 పరుగులు చేసింది. మొత్తమ్మీద 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 3, కైల్ జేమీసన్ 3, అజాజ్ పటేల్ ఒక వికెట్ పడగొట్టారు.