కాన్పూర్లో న్యూజిల్యాండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న టెస్టు మూడోరోజు ఆట ముగిసింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 296 పరుగులకు కివీస్ ఆలౌట్ అయింది. అక్షర్ పటేల్ 5, అశ్విన్ 3 వికెట్లతో విజృంభించారు. అనంతరం 49 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ను జేమీసన్ దెబ్బతీశాడు.
అతని బౌలింగ్లో రెండో ఓవర్లోనే శుభ్మన్ గిల్ (1) బౌల్డ్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకంతో రాణించిన అతను ఈ ఇన్నింగ్స్లో నిరాశపరిచాడు. ప్రస్తుతం మయాంక్ అగర్వాల్ (4 నాటౌట్), ఛటేశ్వర్ పుజారా (9 నాటౌట్) క్రీజులో ఉన్నారు.