అశ్విన్ దెబ్బకు స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిల్యాండ్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడింది. డారియల్ మిచెల్ (60), హెన్రీ నికోల్స్ (26 నాటౌట్) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే మిచెల్ అర్ధశతకం కూడా పూర్తి చేసుకున్నాడు.
ఇన్నింగ్స్ 35వ ఓవర్లో అక్షర్ పటేల్ బౌలింగ్లో భారీ సిక్స్ కొట్టిన మిచెల్.. తర్వాతి బంతికి కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి సరిగా కనెక్ట్ కాకపోవడంతో బౌండరీ లైన్ వద్ద జయంత్ యాదవ్ చేతికి చిక్కాడు. దీంతో 128 పరుగుల వద్ద న్యూజిల్యాండ్ జట్టు నాలుగో వికెట్ కోల్పోయింది. తొలి మూడు వికెట్లను రవిచంద్రన్ అశ్విన్ కూల్చాడు.