IND vs NZ | టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిల్యాండ్ ఓపెనర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. 258 పరుగులతో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 345 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో క్రీజులోకి వచ్చిన కివీస్ ఓపెనర్లు టామ్ లాథమ్ (50 నాటౌట్), విల్ యంగ్ (75 నాటౌట్) అద్భుతంగా ఆడారు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ కలిసి 129 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు టీమిండియా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అర్ధశతకం పూర్తయిన వెంటనే అశ్విన్ బౌలింగ్లో లాథమ్ ఎల్బీగా అవుటైనట్లు అంపైర్ ప్రకటించాడు. అయితే లాథమ్ వెంటనే రివ్యూ కోరాడు.
రివ్యూలో బంతి అతని బ్యాట్ను తాకలేదని తేలింది. దీంతో అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట ముగిసేసరికి కివీస్ జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 129 పరుగులు చేసింది.