కివీస్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో న్యూజిల్యాండ్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. 185 పరుగుల లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన కివీస్ను అక్షర్ పటేల్ తన తొలిబంతికే దెబ్బకొట్టాడు. మూడో ఓవర్లో బంతి అందుకున్న అతని బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డారియల్ మిచెల్ (5).. హర్షల్ పటేల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.
అదే ఓవర్ చివరి బంతికి అక్షర్ మరోసారి కివీస్ను దెబ్బతీశాడు. మార్క్ చాప్మన్ (0)ను అవుట్ చేశాడు. అక్షర్ వేసిన బంతిని ముంకొచ్చి బాదడానికి చాప్మ్ ప్రయత్నించగా మిస్ అయింది. ఆ బంతిని అందుకున్న పంత్ వికెట్లను గిరాటేశాడు. ఆ తర్వాత మళ్లీ ఐదో ఓవర్లో బంతి అందుకున్న అక్షర్ తన నాలుగో బంతికి గ్లెన్ ఫిలిప్స్ను బౌల్డ్ చేశాడు.
దీంతో 30 పరుగులకే కివీస్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అంతకుముందు రెండో ఓవర్ చివరి బంతికి గప్తిల్ కూడా క్యాచ్ ఇచ్చాడు. కానీ దాన్ని అందుకోవడానికి బౌలింగ్ చేసిన చాహరే వెళ్లడంతో మిగతా ఫీల్డర్లు వెనక్కు తగ్గారు. కానీ చాహర్ ఆ బంతిని అందుకోలేకపోయాడు.